suryaudhayam.in
Date of Publish : 30 August 2026, 8:39 pm Posted by : SURYA UDHAYAM MEDIA

KPHB 4వ ఫేజ్ LIG వెంచర్–2 ఎన్నికల్లో మాతంగి మల్లేష్ ఘన విజయం

KPHB 4వ ఫేజ్ LIG వెంచర్–2 ఎన్నికల్లో మాతంగి మల్లేష్ ఘన విజయం

– నూతన కార్యవర్గం ఎన్నిక 

– 630 కుటుంబాల్లో కొత్త ఆశలు

సూర్య ఉదయం ప్రతినిధి, కూకట్‌పల్లి:

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) కాలనీ 4వ ఫేజ్‌లోని LIG వెంచర్–2 గృహ సముదాయంలో అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికల్లో మాతంగి మల్లేష్ ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో నూతన కార్యవర్గ సభ్యులు ఎన్నికై గృహ సముదాయ అభివృద్ధికి బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు.

నూతన కార్యవర్గం ఇలా…

ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా మాతంగి మల్లేష్ విజయం సాధించగా, వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీలుగా హిమబిందు, నాగరాణి, జాయింట్ సెక్రటరీగా విజిత, ట్రెజరర్‌గా అరుణ కుమారి ఎన్నికయ్యారు. అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నరసింహులు, అశోక్ కుమార్, రాజు, వేణుగోపాల్ ఎన్నికయ్యారు.

630 కుటుంబాల్లో కొత్త ఆశలు

నూతన కార్యవర్గం ఎన్నిక కావడంతో గృహ సముదాయంలోని 630 కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురించాయి. దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివిధ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

గృహ సముదాయం అభివృద్ధి, సంక్షేమం, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నివాసితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

నూతన కార్యవర్గానికి అభినందనలు

గృహ సముదాయంలోని 630 కుటుంబాల ప్రజలు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ గృహ సముదాయ సమగ్ర అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.